ముగిసిన నందీశ్వర్ జాతర వేడుకలు

1053చూసినవారు
ముగిసిన నందీశ్వర్ జాతర వేడుకలు
శివరాత్రి వేడుకల్లో భాగంగా బేల మండల బాధి గ్రామంలోని వీర బాధి నందీశ్వర్ జాతర వేడుకలు ఘనంగా ముగిశాయి. జాతర సందర్భంగా సోమవారం దహిహండి (కాళ) పూజతో పాటు, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం హుండీ లెక్కింపు చేపట్టగా 1, 32, 749 రూపాయిలు, 1 కిలో వెండి, 140 కిలోలు గంటలు, 16 దూడలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జుగ్నక్ గాంధీ, సార్ మేడి జుగ్నక్ భీంరావ్, జుగ్నక్ మొతిరామ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్