ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ తన కుమార్తె గొంతు కోసి హత్య చేశాడు. హర్యానాలోని హిసార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న 55 ఏళ్ల సందీప్ గోయల్ తన 8 ఏళ్ల కుమార్తెను యూనివర్సిటీలోని తన కార్యాలయానికి తీసుకెళ్లాడు. అక్కడ సర్జికల్ బ్లేడ్తో ఆమె గొంతు కోసి చంపాడు. అనంతరం అదే బ్లేడ్తో తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా ప్రొఫెసర్ డిప్రెషన్లో ఉన్నట్లు సహోద్యోగులు తెలిపారు.