చంద్రబాబుకు కడుపు మంట: మంత్రి కాకాణి

64చూసినవారు
చంద్రబాబుకు కడుపు మంట: మంత్రి కాకాణి
టీడీపీ చీఫ్ చంద్రబాబుపై వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ మండిపడ్డారు. బాపట్ల జిల్లా మేదరమట్లలో వైసీపీ సిద్ధం సభకు వచ్చిన జనసంద్రాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. సోమవారం కాకాణి మాట్లాడుతూ.. ‘గ్రాఫిక్స్ అని టీడీపీ ప్రచారం చేస్తోంది. గ్రాఫిక్స్‌తో జనం వచ్చినట్లు చూపించాల్సిన అవసరం లేదు. గ్రాఫిక్స్‌కు ఆద్యుడే చంద్రబాబు. గ్యాస్ట్రిక్ సమస్యతో జనసంద్రాన్ని చూసి చంద్రబాబు కడుపు మండిపోతుంది.’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్