గుర్తు తెలియని వ్యక్తి మృతి

5154చూసినవారు
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఆదిలాబాద్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. రైల్వే స్టేషన్ సమీపంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి బుధవారం రైల్వే స్టేషన్ ఎదుట గల మురికి కాలువలో పడి ఉన్నాడు. స్థానికులు గమనించి చూడగా అప్పటికే అతను మృతి చెందాడు. పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్