కేంద్రంలోని మోడీ ప్రభుత్వ కార్మిక, రైతు, విధానాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడుదామని ఐఎఫ్టియు ప్రధాన కార్యదర్శి
జగన్ సింగ్ పిలుపునిచ్చారు. బుధవారం అదిలాబాద్ పట్టణంలోని సంఘం కార్యాలయంలో మేడే వే
డుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జెండాను ఆవిష్కరించి కార్మికుల అనుకూల నినాదాలు చేశారు. కార్పొరేట్ వ్యవస్థలు కార్మికుల శ్రమదోపిడి చేస్తున్నాయని ఆరోపించారు. కార్మికుల హక్కులను కాపాడుకుందాం అన్నారు.