రిమ్స్ కార్మికుల ధర్నా

71చూసినవారు
తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రిమ్స్ ఆసుపత్రి కార్మికుల సమ్మెలో భాగంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. జీవో ఎంఎస్ 60 ప్రకారం కాంట్రాక్టర్ కార్మికులకు వేతనాలు చెల్లించకుండా శ్రమ దోపిడికి పాల్పడుతున్నాడని నేతలు ఆరోపించారు. ఈ విషయమై జిల్లా ఉన్నత అధికారులు స్పందించి కార్మికులకు పూర్తిస్థాయిలో వేతనాలు అందేలా చూడాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్