భర్త హత్య తట్టుకోలేక భార్య మృతి

568చూసినవారు
భర్త హత్య తట్టుకోలేక భార్య మృతి
ఏపీలోని అనంతపురంలో జేఎన్టీయూ సమీపంలో మూర్తిరావు గోఖలే అనే మాజీ ప్రిన్సిపాల్‌ను మేనల్లుడు ఆదిత్య గొంతుకోసి హత్య చేశాడు. భర్త మృతిని తట్టుకోలేకపోయిన మూర్తి భార్య శోభ అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఉద్యోగం ఇప్పిస్తానని మూర్తి నిందితుడి వద్ద గతంలో డబ్బులు తీసుకున్నారని, ఆ విషయంలో మాటామాటా పెరిగి గొడవ జరగడంతోనే హత్య జరిగిందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్