టైలరింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

568చూసినవారు
మహిళలు స్వయం ఉపాధి రంగంలో రాణిస్తూ కుటుంబాలకు అండగా నిలవాలని ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ సూచించారు. దారుల్ అన్సార్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్ శిక్షణ పొందిన మహిళలకు సోమవారం ఆదిలాబాద్ పట్టణంలో సర్టిఫికెట్ పంపిణీ చేశారు. మహిళలు స్వయం ఉపాధి రంగంలో రాణించేలా టైలరింగ్ శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. టైలరింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్ధిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్