అదుపుతప్పి కారు బోల్తా.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

1887చూసినవారు
అదుపుతప్పి కారు బోల్తా.. ఇద్దరికీ తీవ్ర గాయాలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై కారు బోల్తా పడిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే మావల జాతీయ రహదారిపై నుంచి ఎండి అర్ఫాత్, ఉస్మాన్ ప్రయాణిస్తున్న కారు ఆదిలాబాద్ కు వస్తున్న క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది దీపక్, వసీం ఘటన స్థలానికి చేరుకొని వారికి ప్రథమ చికిత్స అందించి స్థానిక రిమ్స్ లో చేర్చారు.

సంబంధిత పోస్ట్