కేసు నమోదైన గంటల వ్యవధిలో దొంగని పట్టుకున్న పోలీసులు

80చూసినవారు
కేసు నమోదైన గంటల వ్యవధిలో దొంగని పట్టుకున్న పోలీసులు
ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో చోరీ జరిగిన కేసు నమోదైన గంటల వ్యవధిలోనే పోలీసులు దొంగను పట్టుకున్నట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. ఇంద్రనగర్ లో భరత్ అనే వ్యక్తి ఇంట్లో ఎవ్వరూ లేకపోవగా, గత రాత్రి కిష్టు అనే వ్యక్తి దొంగతనానికి పాల్పడి 3 వేల నగదు, తులం బంగారాన్ని దొంగలించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని గంటల వ్యవధిలోనే దొంగ ను పట్టుకున్నారు. ఐడి పార్టీ సిబ్బంది రమేష్, సుధాకర్, క్రాంతి, నరేందర్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్