ఎన్నికలలో బూత్ ఇంఛార్జీల పాత్ర చాలా ముఖ్యమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి శ్రీనివాస రెడ్డి అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ బూత్ ఇంఛార్జీల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు అతి సమీపంలో ఉన్నందున ఇప్పటి నుండే బూత్ ఇంఛార్జీలు తమ తమ బూత్ లపై దృష్టి సారించాలన్నారు. ఎన్నికలలో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు.