ఆదిలాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మైనర్ బాలురకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల తెలిపిన వివరాలు ప్రకారం ఇమ్రాన్, ప్రణీత్, జూహెద్ అనే మైనర్ బాలురు స్కూటీపై
వెళ్తున్న క్రమంలో ఈద్గా వద్ద పాత జాతీయ రహదారిపై ఓవైపు నుంచి వస్తున్న బస్సును తప్పించే ప్రయత్నంలో మరోవైపు నుంచి వచ్చిన లారీ ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు