వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎంపీ

1540చూసినవారు
నేరడిగొండ మండలం వాగ్దారి గ్రామంలో యువ మిత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంట్ ను శనివారం ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా గ్రామంలోని కొమరం భీం విగ్రహానికి పూజ చేసి నివాళులు అర్పించారు. ఎంపీ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పది సంవత్సరాల కాలంలో క్రీడలకు ఎంతో అభివృద్ధి చేశారన్నారు. బిజెపి నాయకులు జివి రమణ, రాళ్లబండి మహేందర్ తదితరులున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్