గోదావరి బ్రిడ్జి కింద వ్యక్తి మృతదేహం

21476చూసినవారు
గోదావరి బ్రిడ్జి కింద వ్యక్తి మృతదేహం
మంచిర్యాల గోదావరి బ్రిడ్జి కింద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు మాట్లాడుతూ.. మృతదేహం నీటిలో తేలియాడుతూ ఉందని, మృతుడి జేబులో ఈనెల 19న చెన్నూరు నుంచి మంచిర్యాలకు వచ్చిన ఆర్టీసీ టికెట్ లభించిందన్నారు. ధోవతి కట్టుకొని ఉన్నాడని, పాత మోడల్ తెల్లని చొక్కా నీటి ఒడ్డున విప్పి ఉందన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలో భద్రపరిచినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్