హాజీపూర్ మండలం సబ్బెపల్లిలో చోరీ జరిగింది. ఎస్ఐ నరేష్ కుమార్ వివరాల ప్రకారం.. రాపల్లికి చెందిన గుండా ఐలయ్య భార్య లక్ష్మితో కలిసి చేను పనుల్లో భాగంగా ఇంటికి తాళం వేసి వెళ్ళాడు. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపు విరిగి ఉంది. అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి బీరువాలోని రూ.70వేల నగదు, తులం బంగారు గొలుసు, 18 తులాల వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు.