దుర్గా నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి: ఎస్ఐ

82చూసినవారు
దుర్గా నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి: ఎస్ఐ
రాబోయే దుర్గా నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్ఐ రమేష్ సూచించారు. గురువారం తానూర్ మండలం ఝరి (బి) గ్రామంలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. మొదటి సారిగా గ్రామానికి వచ్చిన ఎస్ఐ ని గ్రామాస్తులు శాలువతో ఘనంగా సన్మానించారు. గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్