కుబీర్: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

58చూసినవారు
కుబీర్: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం పల్సి గ్రామానికి చెందిన మెంచు గజ్జారాం (45) మహారాష్ట్ర లోని కిని గ్రామం నుంచి రాత్రి సమయంలో పల్సి గ్రామానికి బైక్ పై వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కాగా స్థానికుల సహాయంతో భోకర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్