చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

60చూసినవారు
ముధోల్ మండల కేంద్రంలో గురువారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిథులుగా గా స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు, మండల బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్