పత్తి వాహనంలో మంటలు
ఆదిలాబాద్ నియోజకవర్గం నార్నూర్ లో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పత్తి లోడుతో వెళ్తున్న వాహనానికి విద్యుత్ తీగలు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు పత్తిని వ్యాన్ లో ఆదిలాబాద్ జిన్నింగ్ మిల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.