ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తికాకముందే, జూనియర్ కాలేజీల్లో అనధికారిక ప్రవేశాలు చేపడుతన్నారన్న వార్తలు ఇంటర్మీడియట్ బోర్డు పై వస్తున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు వాస్తవాలను వెల్లడించింది. రాబోయే విద్యా ఏడాదికి సంబంధించి 2025-2026 కోసం అనుబంధ నోటిఫికేషన్ అడ్మిషన్ షెడ్యూల్ను ఇంకా జారీ చేయలేదని ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.