May 15, 2024, 04:05 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
రిమ్స్ పేషంట్ కేర్ ఆత్మహత్యయత్నం
May 15, 2024, 04:05 IST
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో పేషంట్ కేర్ గా పని చేస్తున్న లక్ష్మీ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బుధవారం రిమ్స్ లోనే ఆమె ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే సిబ్బంది స్పందించి ఆస్పత్రిలోని ఎంఐసియు వార్డ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సూపర్వైజర్ బెదిరింపులు తట్టుకోలేకనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.