ప్రమాదవశాత్తు కోనేరులో మునిగి వృద్ధుడు మృతి

73చూసినవారు
ప్రమాదవశాత్తు కోనేరులో మునిగి వృద్ధుడు మృతి
దిలావర్పూర్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద కోనేరులో నీట మునిగి వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్సై సుమాంజలి తెలిపారు. కుంటాల మండలం కల్లూరు గ్రామానికి చెందిన రామస్వామి (70) అనే వృద్ధుడు ఎల్లమ్మ అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చాడు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కోనేరులో స్నానం చేసేందుకు వెళ్లాడు. ఈత రాక ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్