లోకో పైలట్ అప్రమత్తతతో కర్ణాటకలోని తుమూకూరు జిల్లాలో యశ్వంత్పుర్ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యశ్వంత్పుర్ ఎక్స్ప్రెస్ హాసన్కు బయలుదేరగా కుణిగల్ సమీపంలోని ట్రాక్పై హైవోల్టేజ్ విద్యుత్ లైన్ పడి ఉంది. లోకోపైలట్ గమనించి రైలుని నిలిపివేయటంతో వేల మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.