అగ్నివీర్, మైనార్టీ తదితర అంశాలను తెరపైకి తెచ్చి సభను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. సీనియర్ నేతలే ఇలాంటి తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే.. పార్లమెంట్ క్లిష్ట సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ‘ఆ నేత (రాహుల్ను ఉద్దేశిస్తూ) చేసిన వ్యాఖ్యలను చిన్న పిల్లల ప్రవర్తన అని చెప్పి తేలికగా తీసుకోవద్దు. వారి వ్యాఖ్యల వెనక కుట్ర ఉందనడంలో సందేహం లేదు’ అని మోదీ దుయ్యబట్టారు.