రైల్వేకోడూరు జ‌న‌సేన అభ్య‌ర్థి మార్పు

156316చూసినవారు
రైల్వేకోడూరు జ‌న‌సేన అభ్య‌ర్థి మార్పు
అన్న‌మ‌య్య జిల్లా రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజ‌క‌వర్గం జ‌న‌సేన ఎమ్మెల్యే అభ్య‌ర్థిని ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మార్పు చేశారు. య‌న‌మ‌ల భాస్క‌ర‌రావు స్థానంలో అర‌వ శ్రీ‌ధ‌ర్ పేరును ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. క్షేత్ర‌స్థాయి నివేదిక‌లు, జిల్లా నేతల అభిప్రాయాల మేర‌కు శ్రీ‌ధ‌ర్ పేరును జ‌నసేనాని ఖ‌రారు చేశారు. కాగా, ప్రస్తుతం ముక్కావారిపల్లె సర్పంచ్‌గా ఉన్న శ్రీధర్ మూడు రోజుల క్రితమే జ‌న‌సేన‌లో చేరారు.

సంబంధిత పోస్ట్