యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన 2,253 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపటితో గడువు ముగియనుంది. ఇందులో 1930 నర్సింగ్ ఆఫీసర్, 323 పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. B.Sc నర్సింగ్ మరియు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. అభ్యర్థులు ఈ నెల 27లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం ఈ https://upsc.gov.in/ వెబ్సైట్ను సందర్శించండి.