హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఈరోజు నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురువనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి అర్థరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో నగరవాసులు జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. సహాయక చర్యలు అందించేందుకు డీఆర్ఎఫ్ బృందాలను సిద్దం చేసినట్లు తెలిపారు.