దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శించేందుకు వచ్చే యాత్రికుల కోసం గురువారం నుంచి స్పాట్ రిజిస్ట్రేషన్ల కార్యక్రమం మొదలైంది. ఇందుకు జమ్మూలోని పురానీ మండి వద్ద రామమందిరం కాంప్లెక్స్లో కేంద్రాన్ని ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ లేకుండా వచ్చే యాత్రికుల పేర్లను ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి యాత్రకు అనుమతిస్తారు. రోజుకు 600 మందికి రిజిస్ట్రేషన్ చేస్తారు.