అదానీ గ్రూప్నకు చెందిన అంబుజా సిమెంట్స్ తమిళనాడులోని తూత్తుకుడిలో మై హోం గ్రూప్కు చెందిన 1.50 MTPA సిమెంట్ గ్రైండిండ్ యూనిట్ను రూ.413.75 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. అంబుజా.. దాని అనుబంధ సంస్థలతో కలిపి దేశవ్యాప్తంగా 18 ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ఉత్పత్తి ప్లాంట్లు, 19 సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లు కలిగి ఉంది. దీంతో అదానీ గ్రూప్ సిమెంట్ సామర్థ్యం 78.90 MTPAకు చేరింది.