భారత్‌లో ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని అమెరికా సూచన

60చూసినవారు
భారత్‌లో ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని అమెరికా సూచన
భారత్‌లో పర్యటించే అమెరికా పౌరులకు ఆ దేశం కీలక సూచనలు చేసింది. భారత్‌లోని మణిపూర్‌, జమ్మూకశ్మీర్, భారత్-పాకిస్థాన్ సరిహద్దులతో పాటు మావోయిస్టులు క్రియాశీలకంగా ఉన్న దేశ మధ్య, తూర్పు ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది. ఈశాన్య రాష్ట్రాలకు ప్రయాణంపై పునరాలోచించాలంటూ రివైజ్డ్‌ ట్రావెల్‌ అడ్వైజరీని ఆ దేశ విదేశాంగ శాఖ తాజాగా విడుదల చేసింది. భారత్‌లో పెరుగుతున్న నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.

సంబంధిత పోస్ట్