ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో వ్యాపారవేత్త అమిత్ అరోరాకు మధ్యంతర బెయిల్ లభించింది. తాజాగా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన భార్యకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని, ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ రెండు నెలల మధ్యంతర బెయిల్ కోసం అమిత్ అరోరా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రూ.2 లక్షల వ్యక్తిగత బాండ్పై బెయిల్ మంజూరు చేశారు.