పీవోకేపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

50చూసినవారు
పీవోకేపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్ ఇండియాకే చెందుతుందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. పాక్ వ‌ద్ద అణుబాంబులు ఉన్నాయ‌ని, ఆ దేశాన్ని గౌర‌వించాల‌ని కాంగ్రెస్ నేత‌లు అంటున్నార‌ని విమ‌ర్శించారు. పాక్ వ‌ద్ద బాంబులు ఉన్నాయ‌ని, కాబ‌ట్టి పీవోకే గురించి మాట్లాడ‌వ‌ద్దు అని కాంగ్రెస్ నేత మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ పేర్కొన్న విష‌యాన్ని మంత్రి తెలిపారు. అణు బాంబు ఉందన్న భ‌యంతో.. పీవోకేను వ‌దులుకోవాల‌న్న ఆలోచ‌న స‌రికాదు అని అమిత్ షా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్