ఆలయంలో యువకుడిని తొక్కి చంపిన ఏనుగు.. ఫుటేజీ విడుదల

572చూసినవారు
కేరళలోని వైకం ఆలయంలో ఓ వ్యక్తిని ఏనుగు తొక్కి చంపిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ విడుదలైంది. ఈ ఘటనలో అరవిందన్ (25) అనే యువకుడు మృతి చెందాడు. టీవీ పురంలోని శ్రీరామస్వామి ఆలయ ఉత్సవాల కోసం టంకికాడు ప్రాంతం నుంచి కుంజులక్ష్మి అనే ఏనుగును తీసుకొచ్చారు. ఏనుగును అలంకరిస్తున్నప్పుడు, అది అకస్మాత్తుగా పక్కన ఉన్న వ్యక్తిపై దాడి చేసి అతడి తలపై తొక్కింది. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్