ఎన్నికల విధుల్లో ఉండగా గుండెపోటు.. ఉద్యోగి మృతి

27695చూసినవారు
ఎన్నికల విధుల్లో ఉండగా గుండెపోటు.. ఉద్యోగి మృతి
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న వేళ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల విధుల్లో ఉండగా గుండెపోటుతో ఉద్యోగి శ్రీకృష్ణ మృతి చెందారు. అశ్వారావుపేట పరిధిలోని నెహ్రూనగర్‌ పోలింగ్‌ బూత్‌లో ఈ ఘటన జరిగింది. మరోవైపు అశ్వారావుపేట మండలం వేదాంతపురంలో కాశి వెంకటేశ్వరరావు (54) అనే ఓటర్ ఓటు‌ వేసి వెళ్తుండగా గుండెపోటుకు గురై మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్