తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న వేళ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల విధుల్లో ఉండగా గుండెపోటుతో ఉద్యోగి శ్రీకృష్ణ మృతి చెందారు. అశ్వారావుపేట పరిధిలోని నెహ్రూనగర్ పోలింగ్ బూత్లో ఈ ఘటన జరిగింది. మరోవైపు అశ్వారావుపేట మండలం వేదాంతపురంలో కాశి వెంకటేశ్వరరావు (54) అనే ఓటర్ ఓటు వేసి వెళ్తుండగా గుండెపోటుకు గురై మృతి చెందాడు.