కేరళ రాష్ట్రం షోరన్పూర్లోని గురువాయూరప్పన్నగర్లో ఉండే ఉష (62) 2016లో ఓటేసింది. తొమ్మిదేళ్లైనా ఆమె వేలిపై వేసిన ఇంకు గుర్తు మాసిపోలేదు. అనేక రకాల సబ్బులు, ద్రావణాలతో కడిగినా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో 2019 లోక్సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఉష ఓటే వేయలేదు. ఈ సారి అదే సమస్య ఎదురవుతుందేమోనని భయపడుతున్నారు.