బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వచ్చి భారీ విజయం అందుకున్న చిత్రం యానిమల్. తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఓటీటీ ఫ్లాట్ఫామ్లో ఈ చిత్ర రన్టైంకు మరో 8 నిమిషాలు జోడిస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఇక జనవరి 26 నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు.