బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ ఇటీవల ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్లో అందుబాటులో ఉండగా 3 రోజుల్లో రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ అందుకుంది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం 20.8 మిలియన్ స్ట్రీమింగ్ అవర్స్ని క్రాస్ చేయగా, 4 రోజుల్లో 150 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ని 25 మిలియన్ మేర స్ట్రీమింగ్ అవర్స్ని కంప్లీట్ చేసుకుంది.