పారాలింపిక్స్​లో భారత్‌కు ​మరో సిల్వర్.. 8కి చేరిన పతకాల సంఖ్య

62చూసినవారు
పారాలింపిక్స్​లో భారత్‌కు ​మరో సిల్వర్.. 8కి చేరిన పతకాల సంఖ్య
పారిస్ పారాలింపిక్స్​లో భారత్ ఖాతాలో రెండో సిల్వర్ మెడల్ చేరింది. సోమవారం జరిగిన పోటీల్లో పారా అథ్లెట్ యోగేశ్ కుతునియా రజతం దక్కించుకున్నాడు. డిస్కస్ త్రోవర్ F56 విభాగంలో పోటీ పడ్డ యోగేశ్ 42.22మీటర్ల ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచాడు. కాగా, పారాలింపిక్స్​లో సిల్వర్ దక్కించుకోవడం ఇది వరుసగా రెండోసారి. 2020 టోక్యోలోనూ అతడు రజతం సాధించాడు. దీంతో పారిస్ పారాలింరిక్స్​లో భారత్ పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది.

సంబంధిత పోస్ట్