ఖరీఫ్ సీజన్ కార్యాచరణపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఏపీ వ్యాప్తంగా 46.45 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగవుతోందని.. పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘‘నకిలీ విత్తనాలకు చెక్ పెట్టాలి. అనుమతి లేని రకాలు, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రకృతి వ్యవసాయం, బిందు సేద్యం ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచాలి’’ అని దిశానిర్దేశం చేశారు.