ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలు ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి జేఎన్టీయూహెచ్లో ఫలితాలను విడుదల చేస్తారు. ఈ మేరకు ఎప్సెట్ కన్వీనర్ డీన్కుమార్, కో కన్వీనర్ విజయ్కుమార్రెడ్డి ప్రకటన విడుదల చేశారు.