ప్రధాని
మోదీ, కేంద్ర మంత్రులు,
బీజేపీ నాయకులపై భారత యువ మహిళా క్రికెటర్ పూజా వస్ట్రాకర్ పెట్టిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో పూజా క్షమాపణలు చెప్పారు. 'నా సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఓ అభ్యంతరకర పోస్ట్ వచ్చినట్లు నా దృష్టికి వచ్చింది. కానీ అది జరిగిన సమయంలో నా ఫోన్ నా వద
్ద లేదు. ఇందుకు నన్ను క్షమించాలి' అని ఆమె పేర్కొన్నారు. కాగా 'వసూలి టైటాన్స్' పేరుతో
బీజేపీ అగ్రనేతలపై ఆమె ఇన్స్టా పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.