రోగి బంధువులు దాడి చేయడంతో.. సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లు, నర్సులు

85చూసినవారు
రోగి బంధువులు దాడి చేయడంతో.. సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లు, నర్సులు
బెంగాల్‌లోని పరగణాస్ జిల్లాలోని సాగౌర్ దత్తా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు, నర్సులపై రోగి బంధువులు శుక్రవారం దాడి చేశారు. శ్వాసకోశ సమస్యతో రంజనా సౌ అనే మహిళను కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల మరణించిందని.. ఆమె బంధువులు డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్లు, నర్సులపై దాడి చేశారు. ఈ ఘటనపై జూనియర్ డాక్టర్లు, నర్సులు సమ్మెకు దిగారు.

సంబంధిత పోస్ట్