అస్సాంలో గణనీయంగా ముస్లిం జనాభా: సీఎం హిమంత

53చూసినవారు
అస్సాంలో గణనీయంగా ముస్లిం జనాభా: సీఎం హిమంత
తమ రాష్ట్రంలో ముస్లిం జనాభా ప్రతి పదేళ్లకు 30 శాతం పెరుగుతోందని, 2041 నాటికి వారే మెజారిటీ అవుతారని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ శుక్రవారం పేర్కొన్నారు. గౌహతిలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం అస్సాం జనాభాలో ముస్లిములు 40 శాతంగా ఉన్నారన్నారు. ముస్లిం సమాజంలో జనాభా పెరుగుదలను తగ్గించేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. జనాభా నియంత్రణకు రాహుల్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్