కంగనా దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం.. పరుగులు తీసిన పోలీసులు

63చూసినవారు
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మాటలపై యూపీలోని హాపూర్‌లో భారతీయ కిసాన్ యూనియన్ మోర్చా సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కంగనా రనౌత్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు దిష్టిబొమ్మను లాక్కుని పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

సంబంధిత పోస్ట్