అచ్చుతాపురం రియాక్టర్ ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం

77చూసినవారు
అచ్చుతాపురం రియాక్టర్ ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం
ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అలాగే ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారికి రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు పీఎంఓ ప్రకటించింది. కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది మరణించారని, 50 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్