2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) గురువారం విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ 11.08శాతం పెరిగిందని వెల్లడించింది. 2023 మార్చి నాటికి కేంద్ర బ్యాంకు వద్ద రూ.63.45 లక్షల కోట్ల బ్యాలెన్స్ ఉండగా.. గత ఆర్థిక సంవత్సరంలో అది రూ.7.02 లక్షల కోట్లు పెరిగి రూ.70.47 లక్షల కోట్లకు చేరిందని తెలిపింది.