హిందుత్వ పార్టీగా ముద్రపడ్డ బీజేపీ దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అయోధ్య, బద్రీనాథ్లో ఓటమిపాలవడం విస్మయానికి గురిచేస్తోంది. రాముడే ప్రధాన అస్త్రంగా బీజేపీ లోక్సభ ఎన్నికల బరిలో దిగింది. అయోధ్య (ఫైజాబాద్ లోక్సభ స్థానం)లో ఆ పార్టీ అభ్యర్థి లల్లూ సింగ్పై SP అభ్యర్థి అవదేశ్ గెలుపొందారు. తాజాగా వెలువడిన బద్రీనాథ్ అసెంబ్లీ ఉపఎన్నికలో INC అభ్యర్థి లఖ్పత్ చేతిలో బీజేపీ అభ్యర్థి రాజేంద్రసింగ్ ఓటమిపాలయ్యారు.