ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో ముంబై పోలీసులు మరో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఒకరు షూటర్ కి, ప్రధాన సూత్రధారికి మధ్య లింక్ కలిగి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు హర్యానాలో అమిత్ హిసంసింగ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా, రూపేష్ రాజేంద్ర మోహోల్, కరణ్ రాహుల్ సాల్వే, శివమ్ అరవింద్ కోహద్ అనే ముగ్గురిని పుణెలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో 14 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు.