ఢిల్లీ, ముంబాయి, హైదరాబాద్ వంటి 6 ప్రధాన విమానాశ్రయాల్లో గత 4 నెలల్లోనే బ్యాగేజీ డెలివరీ సమయం మెరుగైంది. ఈ విమానాశ్రయాల్లో 90 శాతానికి పైగా ప్రయాణికులకు విమానం ల్యాండింగ్ అయిన 30 నిమిషాల్లోనే బ్యాగేజీని అందించారని పౌర విమానయాన శాఖ తెలిపింది. అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయ ఆపరేటర్లు, ఇతర విమానాశ్రయాలు బ్యాగేజీ డెలివరీ సమయాన్ని తగ్గించుకోవాలని సూచించింది.