ప్రొ కబడ్డీ సీజన్ -10 హైదరాబాద్ లో ప్రారంభమైన సందర్భంగా లీగ్ ప్రచారకర్త, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి తెలుగు టైటాన్స్-బెంగళూరు బుల్స్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. బాలయ్య తొడ గొట్టి క్రీడాకారులను, అభిమానులను ఉత్తేజపరిచారు. ఆయన మాట్లాడుతూ క్రికెట్ తరువాత కబడ్డీ బాగా ప్రాచుర్యం పొందిందన్నారు. తన కారులో ఎప్పుడు క్రికెట్ కిట్ ఉంటుందన్నారు.